News February 27, 2026
డోంట్ వర్రీ.. పులి కదలికల్ని గమనిస్తున్నాం: రంప FRO

పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్లోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాలలో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి కదలికలు డ్రోన్ థెర్మల్ ఇమేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు..
Similar News
News March 4, 2026
రాజమండ్రి: అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్మెంట్లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
విజయవాడ IAS భార్య మృతి అప్డేట్ ఇదే..!

సీనియర్ IAS అధికారి GC కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమేనని ధ్రువీకరిస్తూ కేసును క్లోజ్ చేశారు. 2026 జనవరి 4న సత్య దీపిక మృతి చెందారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ఆధారంగా సత్యదీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమే అని తేల్చారు. దీంతో ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును అధికారికంగా మంగళవారం క్లోజ్ చేశారు.


