News February 27, 2026
మార్చి 1 నుంచి పెరగనున్న ఫోన్ ధరలు

వివో, iQOOలోని పలు మోడల్స్ ధరలు MAR 1 నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. Vivo T4 బేస్ వేరియంట్ ₹22,999 ఉండగా ₹26,999కు పెరగనుంది. మిడ్, టాప్ వేరియంట్లూ ₹2వేలు పెరగనున్నాయి. Vivo T4R వేరియంట్లపై చెరో ₹2వేలు, T4Xకు ₹1500 పెరగనుంది. iQOO Z10, iQOO Z10R మోడళ్లు ₹2వేలు పెరగనున్నాయి. ఇక iQOO Z10x బేస్ వేరియంట్పై ₹1500, మిడ్, టాప్ వేరియంట్లు ₹2500 పెరగనున్నాయి. ఇప్పటికే శాంసంగ్ కూడా ధరలు పెంచింది.
Similar News
News March 1, 2026
ఈ రంగు కార్లలో మరింత వేడి!

వేసవిలో కారు రంగు ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తెలుపు వంటి లేత రంగులు సూర్యరశ్మిని పరావర్తనం చేయడంతో క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. కానీ నలుపు వంటి ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ముదురు రంగు కార్లలో AC కూలింగ్ ఆలస్యమవ్వడమే కాకుండా కంప్రెషర్పై భారం పడి మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
News March 1, 2026
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో 100 పోస్టులు

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(<
News March 1, 2026
ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: పుతిన్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ హత్య కిరాతకమైన చర్య అని పేర్కొన్నారు. నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ఇరాన్ సన్నిహితుడు మసూద్ పెజెష్కియాన్(ప్రెసిడెంట్)కు రాసిన లేఖలో పేర్కొనట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ హతమైన విషయం తెలిసిందే.


