News February 27, 2026

నిర్మల్: నేషనల్ మెరిట్ టెస్టులో 70 మంది విద్యార్థులు అర్హత

image

నవంబర్ 2025లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ పరీక్షలో నిర్మల్ జిల్లాకు చెందిన 70 మంది విద్యార్థులు స్కాలర్షిప్ కు అర్హత సాధించారని డీఈఓ భోజన్న తెలిపారు. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రొవిజినల్ లిస్టును జారీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా విద్యార్థులు అర్హత సాధించడం పట్ల డీఈవో భోజన్న విద్యార్థులను అభినందించారు.

Similar News

News March 1, 2026

సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

image

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

News March 1, 2026

విశాఖ: వెంకటాద్రి వంటిల్లు వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

News March 1, 2026

బాణసంచా కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు

image

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.