News February 27, 2026
ఇథనాల్ మిక్స్.. మీ వాహనం సేఫేనా – 2/2

వాహనం 2023 కన్నా ముందుదైతే E20కి తగినదో కాదో చెక్ చేయడం మంచిది. E20కి పనికిరాదంటే తరచూ సర్వీస్ చేయిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంక్లో E20 పెట్రోల్ నిలువ ఉంచి వాహనం ఎక్కువ కాలం వాడకపోతే ఇంజిన్, ఫ్యూయెల్ సిస్టమ్ పాడైపోతాయి. E20తో వాహనాల మైలేజ్ తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు, కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా, వీటితో పాత వాహనదారులకు మెయింటెనెన్స్ భారంగా మారే అవకాశం ఉంది.
Similar News
News March 4, 2026
బిహార్ సీఎంగా బీజేపీ నేత?

బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.
News March 4, 2026
అరుదైన రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా

రేపు T20 WCలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్గా 500 వికెట్ల క్లబ్లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.
News March 4, 2026
యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్తోపాటు ఇరాక్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.


