News February 28, 2026

రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

image

దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News March 2, 2026

వార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

image

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వార్ ఎఫెక్ట్‌తో ఈరోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎటర్నల్, L&T, ఏషియన్ పేయింట్స్ షేర్లూ నష్టాల్లో ఉన్నాయి.

News March 2, 2026

SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

image

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.

News March 2, 2026

నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.