News February 28, 2026
ప.గో మూడు నెలల జీతాలు విడుదల.. Way2News ఎఫెక్ట్

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై Way2News వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను జడ్పీ ఛైర్పర్సన్ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. ప్రభుత్వ సత్వర నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
సంజూ హాఫ్ సెంచరీ

T20WC: కీలక మ్యాచ్లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.
News March 1, 2026
GDK: స్టేషన్లో పార్కింగ్ ఏంటని బైక్పై ప్రతాపం చూపించిన పోలీస్ అధికారి

RMG పోలీస్ కమిషనరేట్లోని ఓ పోలీస్ స్టేషన్లో హోంగార్డుకు సంబంధించిన బైక్ను ఓ పోలీస్ అధికారి శనివారం ధ్వంసంచేశారు. అ ఠాణాలో రోజు పార్కింగ్ చేసి PDPLకి నిత్యం విధులు నిర్వహించేందుకు హోంగార్డు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పార్కింగ్ ఏంటని కోపగించుకున్న సదరు పోలీస్ అధికారి ఏకంగా బైక్పై తన ప్రతాపాన్ని చూపించారు. ఇష్టానుసారంగా పగలగొట్టి కసి తీర్చుకున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.
News March 1, 2026
NTR: హైకోర్టు గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపన చేసిన CJI

అమరావతి హైకోర్టు సమీపంలో 6,300 చదరపు గజాల స్థలంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ పనులకు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైట్లో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలసి CJI పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 50,000 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో G+3 తరహాలో అధికారులు CRDA ఈ గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు.


