News February 28, 2026
నెల్లూరు జిల్లాకు రూ.126.91 కోట్ల కేటాయింపు

నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,89,647 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం రూ.126.91 కోట్లను కేటాయించిందని DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.
Similar News
News March 4, 2026
నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.
News March 4, 2026
నెల్లూరు కలెక్టర్ చొరవ.. వృద్ధురాలికి ఇల్లు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.
News March 4, 2026
నెల్లూరు: లోన్లు ఇప్పిస్తాం.. మాకేంటి..?

బ్యాంకు రుణాలు రిసోర్స్ పర్సన్లకు కాసులు కురిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 37వేల పొదుపు సంఘాల్లో 3.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1575.51 కోట్ల రుణ లక్ష్యానికి రూ.1301.67 కోట్లు పూర్తి చేశారు. రూ.లక్షకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు గ్రూపు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.37 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని సమాచారం. మీ దగ్గర ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి.


