News February 28, 2026
గుంటూరు: MRI స్కాన్కి వెళ్తే.. నెల రోజులు ఆగాల్సిందే..!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా C.T స్కాన్, MRI సేవలలో తీవ్రమైన రద్దీ నెలకొంది. ట్రామా వంటి అత్యవసర కేసుల్లో కీలకమైన MRI కోసం రోగులు 20–30 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సేవలను మెరుగుపరచాలని కోరుతున్నారు.
Similar News
News March 1, 2026
ఏలూరు: కార్మిక శాఖ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News March 1, 2026
సండేను ఫండేగా మార్చుకోండి

వారమంతా బిజీగా గడిపిన చాలా మందికి సండే అంటే రెస్ట్డే. ఎక్కువసేపు నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆదివారాన్ని ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంతో సమయం గడపడం, బుక్ రీడింగ్, వాకింగ్, గదిని సర్దుకోవడం, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం వంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో పాటు వచ్చేవారంలో చేయాల్సిన పనులపై ప్లాన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
News March 1, 2026
ఇరాన్పై అమెరికా దాడులకు అదే కారణమా?

ఓవైపు చర్చలు కొనసాగుతుండగా సడన్గా ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇరాన్ వైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరాన్ మొదట నుంచి న్యూక్లియర్ అగ్రిమెంట్ చర్చలపై నిజాయితీగా లేదని US అధికారులు చెబుతున్నారు. పౌరుల అవసరాల కోసం ఉచితంగా న్యూక్లియర్ ఫ్యూయెల్ అందిస్తామన్నా ఇరాన్ యురేనియమ్పై పట్టుబట్టిందని తెలిపారు.


