News February 28, 2026

కప్పలబండలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

పుట్టపర్తి మం. కప్పలబండలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా పింఛన్ నగదు అందజేశారు. నారాయణప్ప, లక్ష్మి తదితరుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందిస్తూ.. పంపిణీ సక్రమంగా జరుగుతుందా అని ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, గౌరవంగా మాట్లాడుతున్నారా వంటి వివరాలను లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

సంగారెడ్డిలో సదరం శిబిరాల షెడ్యూల్‌ విడుదల

image

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన ‘సదరం’ శిబిరాల షెడ్యూల్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్‌ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు తగు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

News March 3, 2026

కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

image

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్‌లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.

News March 3, 2026

KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

image

కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కేయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.