News February 28, 2026
ఖమ్మం: బీసీ భూముల మీద కక్ష సాధింపు ఎందుకు: తీన్మార్ మల్లన్న

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల ఖబ్జాలో ఉన్నప్పుడు, పేద బీసీ కుటుంబాల 62 ఎకరాల భూముల మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులతో ముఖాముఖిగా సమావేశమైన మల్లన్న ప్రభుత్వంపై అగ్గి రవ్వలు రువ్వారు.
Similar News
News March 3, 2026
నేడు ఖమ్మం కమిషనరేట్లో మద్యం దుకాణాలు బంద్

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 3, 2026
పిడుగుల నుంచి విద్యుత్ రక్షణ.. 109 అరెస్టర్ల ఏర్పాటు

రుములు, మెరుపుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఖమ్మం సర్కిల్ వ్యాప్తంగా 109లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. పిడుగుల నుంచి వచ్చే అధిక వోల్టేజ్ను ఇవి భూమిలోకి మళ్లించి ఉపకరణాలను కాపాడుతాయని వివరించారు. ముందస్తు చర్యలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు కూడా విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 2, 2026
99 రోజుల ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే ఈ కార్యాచరణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.


