News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 28, 2026
అమెరికాతో ఢీ.. ఇరాన్కు ఎందుకింత ధైర్యం?

మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న US, ఇజ్రాయెల్తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ ఆయుధ సంపత్తితో పాటు మిత్రపక్షాల బలమే దీనికి కారణం. హమాస్, హెజ్బోల్లా, హౌతీ, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్తో పాటు ఇరాక్లోని కొన్ని గ్రూపులూ మద్దతు ఇస్తున్నాయి. రష్యా, చైనా కూడా ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇక ఆసియాలో ఇరాన్కు పాక్ మిత్రదేశంగా ఉంది. కానీ USను ఎదురించి ఆ దేశానికి మద్దతిచ్చే ధైర్యం పాక్కు లేదు.
News February 28, 2026
ఇండియాలోనే ఎత్తైన కుటుంబాన్ని చూశారా?

సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒకే ఎత్తులో ఉండటం అరుదు. కానీ పుణేకు(MH) చెందిన కులకర్ణి కుటుంబంలోని నలుగురూ ఆజానుబాహులే. తండ్రి శరద్ (7.2ft), తల్లి సంజ్యోత్ (6.3ft), కుమార్తెలు మృగ (6.2ft), సానియా 6.4ft ఉండటంతో ఈ కుటుంబం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. వీరి ఎత్తుకు తగ్గట్టుగా ఇంట్లోని తలుపులను 8 అడుగుల మేర రూపొందించుకున్నారు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News February 28, 2026
స్కూల్ ఫీజులపై కీలక నిర్ణయం!

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపునకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 11k స్కూళ్లలో ప్రస్తుత ఫీజులు, గత 3ఏళ్లలో స్కూళ్ల ఆదాయ వ్యయాల డేటాను సేకరించాలని నిర్ణయించింది. 2ఏళ్లకు 8% మాత్రమే పెంచుకునేలా అనుమతించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలో ఫీజుల డ్రాఫ్ట్ను స్కూళ్ల వారీగా పబ్లిక్ డొమైన్లో పెట్టనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫీజులను ఖరారు చేయనుంది.


