News February 28, 2026

అమీన్పూర్: కోకాపేట్ శారదా పీఠం వద్ద ఉద్రిక్తత: హరీశ్ రావు

image

కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారదా పీఠం ఖాళీ చేయించేందుకు అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకుని ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. గతంలో కేటాయించిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ నేతలు పీఠానికి సంఘీభావం తెలిపి, ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 8, 2026

ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 5న ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు చేసిన సిట్.. కోర్టులో అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.

News March 8, 2026

ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

image

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.