News February 28, 2026
మిడిల్ ఈస్ట్లో యుద్ధం.. భారతీయులకు అలర్ట్

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, ఇరాన్, UAE, జోర్డాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దని చెప్పింది. ఎప్పటికప్పుడు వార్ న్యూస్ తెలుసుకుంటూ అవగాహనతో ఉండాలని తెలిపింది. అత్యవసర సహాయానికి తమ దేశంలోని ఎంబసీలను సంప్రదించాలని పేర్కొంది.
Similar News
News March 5, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర మరోసారి తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,630 తగ్గి రూ.1,62,880కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,500 పతనమై రూ. 1,49,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరల్లో కాస్త మార్పులుండొచ్చు.
News March 5, 2026
ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
News March 5, 2026
ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


