News February 28, 2026
NPDCL చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదయిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.
News March 1, 2026
కడప జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మద్యం తాగేశారు

కడప జిల్లాలో గత నెలలో రోజుకు రూ.3.30 కోట్ల మద్యం తాగేశారు. ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో రూ.92.67 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సర్కిల్ వారీగా రూ.కోట్లలో వివరాలు ఇలా ఉన్నాయి. కడప-24.85, సిద్దవటం-3, బద్వేల్-10.13, జమ్మలమడుగు-7.23, ముద్దనూరు రూ-3.77, మైదుకూరు-9, ప్రొద్దుటూరు-16.40, పులివెందుల-10.68, ఎర్రగుంట్ల-7.58. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, గంటకు రూ.28 లక్షల మద్యం తాగేశారు.
News March 1, 2026
త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.


