News February 28, 2026

కాకినాడ పేలుడు ఘటనపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

Similar News

News March 1, 2026

కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

image

చెన్నైలోని<> కామరాజర్ పోర్టు<<>> 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in

News March 1, 2026

సమయం మారి… సమాచారం లీకై..!

image

ఇరాన్ సుప్రీం ఖమేనీపై US నెలల తరబడి నిఘా పెట్టి దాడిచేసింది. US నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు గుర్తించినా ఏ భవనంలో అన్నది స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని నిన్న ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

News March 1, 2026

ఇరాన్‌కు UAE ప్రెసిడెంట్ వార్నింగ్

image

‘మీ యుద్ధం పొరుగుదేశాలతో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ఇరాన్‌ను UAE ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ జాయెద్ హెచ్చరించారు. పొరుగు దేశాలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. UAEలోని పలు ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడులు గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ను దూరం చేశాయన్నారు. US, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.