News February 28, 2026
జగిత్యాల : 36 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. 36 ఏళ్లపాటు పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐ బిక్షపతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ, శాఖకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 14, 2026
ప.గో: మహిళపై లైంగిక వేధింపులు.. మూడేళ్ల జైలు

జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జులైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్పీవీఎస్ మురళీకృష్ణ.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.
News March 14, 2026
కామారెడ్డి: ఆర్టీసీ బస్సుల్లో పది విద్యార్థులకు బంపర్ ఆఫర్!

కామారెడ్డి జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది. విద్యార్థులు చేయి ఎత్తిన చోట బస్సులు ఆపాలని, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News March 14, 2026
WGL: చికెన్ ధరలు… కిలో రూ.300 దాటింది

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో చికెన్ కిలో ధర రూ.300 దాటగా, స్కిన్లెస్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజులుగా ధరలు రూ.280 కంటే తగ్గడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. వేసవి తీవ్రతతో కోళ్లు చనిపోవడం వల్ల ఫాముల్లో ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.


