News February 28, 2026

జగిత్యాల: వసతి గృహ సంక్షేమ అధికారుల డైరీ ఆవిష్కరణ

image

జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జి.సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఎండీ సాజిద్ బాబా, సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

కప్పు కొట్టాలంటే ఈ లోపాలు సరిదిద్దుకోవాల్సిందే!

image

టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరినప్పటికీ టైటిల్ గెలవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్‌లో బుమ్రాపైనే ఆధారపడటం బలహీనతలుగా మారాయి. టోర్నీలో పేలవమైన క్యాచ్‌ల రికార్డ్ ఆందోళనకరం. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమవుతుండటంతో ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరి వ్యక్తిగత మెరుపులపైనే టీమ్ ఆధారపడుతోంది. ఇంగ్లండ్‌తో పోరులో సమష్టిగా రాణించకపోతే కప్పు కలగానే మిగిలిపోతుంది!

News March 3, 2026

వాళ్లు నన్ను చంపేస్తారు: ఇరాన్ హీరోయిన్

image

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం దిగిపోయేవరకు తాను ఆ దేశంలో అడుగుపెట్టలేనని సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ అన్నారు. ఖమేనీ మృతి విషయం తెలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇరాన్‌ వెళ్తే చంపేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల వయసులో ఆమె ఇరాన్‌ను వీడారు. తర్వాత యూరప్‌లో మోడలింగ్‌ నేర్చుకున్నారు. ప్రస్తుతం INDలోనే ఉన్నారు.

News March 3, 2026

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

image

TG: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రాన్ని BRS, INC అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.