News February 28, 2026

కామారెడ్డి: ఉపాధి కూలీలతో కలిసి కాంగ్రెస్ నేతల పని

image

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగఠన్ సృజన్ అభియాన్ 8వ రోజు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా మదనపల్లిలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మన్రేగా (ఉపాధి హామీ) పథక పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో కలిసి పని చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 2, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.

News March 2, 2026

అన్నమయ్య: కరెంట్ సమస్యలు ఉంటే కాల్ చేయండి!

image

అన్నమయ్య జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి APSPDCL సీఎండీ శివశంకర్ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. వినియోగదారులు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.

News March 2, 2026

ASF: నైపుణ్యాలున్నా.. ఉపాధ్యాయులు లేరే..!

image

జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. 11 జూనియర్ కాలేజీల్లో 4,625 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కచోట కూడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వం ప్రతి కళాశాలకు ఏటా రూ.10,000లను క్రీడా నిధులకు అందిస్తోంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలున్నా ఉపాధ్యాయుడు లేక చదువుకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పీడీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.