News March 1, 2026

ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతం చేశాం: ఇజ్రాయెల్

image

అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్, నెతన్యాహు వెల్లడించారు. రక్షణ మంత్రి అజీజ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ షంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్‌పౌర్, SPND ఛైర్మన్ హోస్సేన్ జబల్, SPND మాజీ ఛైర్మన్ మొజాఫరీ, అలన్బే కమాండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సలేహ్ అసాదీ హతమయ్యారు.

Similar News

News March 3, 2026

డ్రోన్ల యుద్ధం!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్‌పై, నిన్న అరామ్‌కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్ల‌తో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.

News March 3, 2026

ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

image

T20 WC సెమీస్‌లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్‌లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.

News March 3, 2026

ఖమేనీ కోసం కెమెరాలు, మొబైల్ నెట్‌వర్క్ హ్యాక్?

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ ఏళ్లుగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా ఇరాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్కడి మొబైల్ నెట్‌వర్క్‌లోకీ చొరబడి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఇది కొన్నేళ్లపాటు జరిగినట్లు వెల్లడించింది. ఖమేనీ బాడీగార్డ్స్‌ కదలికల్ని స్పష్టంగా పసిగట్టగలిగే కెమెరా ఒకటి బాగా ఉపయోగపడినట్లు సమాచారం.