News March 1, 2026
రేపు వికారాబాద్కు రాహుల్ గాంధీ రాక

అనంతగిరిలోని హరిత రిసార్ట్లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీల శిక్షణా తరగతులు రేపటితో ముగుస్తాయి. ఈ తరగతులకు ఈ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ రానున్నారు. జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని సమాచరం. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News March 2, 2026
మెండోరా: హాస్టల్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

మెండోరా మండలం పోచంపాడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్పల్లి మండలానికి చెందిన నెహ్రూగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు.


