News March 1, 2026

కడప జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మద్యం తాగేశారు

image

కడప జిల్లాలో గత నెలలో రోజుకు రూ.3.30 కోట్ల మద్యం తాగేశారు. ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో రూ.92.67 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సర్కిల్ వారీగా రూ.కోట్లలో వివరాలు ఇలా ఉన్నాయి. కడప-24.85, సిద్దవటం-3, బద్వేల్-10.13, జమ్మలమడుగు-7.23, ముద్దనూరు రూ-3.77, మైదుకూరు-9, ప్రొద్దుటూరు-16.40, పులివెందుల-10.68, ఎర్రగుంట్ల-7.58. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, గంటకు రూ.28 లక్షల మద్యం తాగేశారు.

Similar News

News March 15, 2026

విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి: ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.

News March 15, 2026

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరి సూసైడ్

image

శ్రీ సత్యసాయి(D) తాడిమర్రి మండలంలో వేర్వేరు చోట్ల శనివారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిడిగల్లు గ్రామానికి చెందిన దీపిక(21) కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. పుల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్(47) అప్పుల బాధ తాళలేక మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News March 15, 2026

ఏలేశ్వరం కాలువలో వ్యక్తి మృతదేహం కలకలం

image

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద ఏలేరు కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు లింగవరం కాలనీకి చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. కాలువ గట్టుపై బైక్, నగదు ఉంచి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.