News March 1, 2026
విజయవాడలో వివాహిత సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలోని మాచవరంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మృతురాలు బజినున్నీసా కిషోర్ను ప్రేమ వివాహం చేసుకుంది. శనివారం రాత్రి వీరిరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI దుర్గ భవాని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News March 4, 2026
ఖమ్మం: మొక్కజొన్న రైతులకు దక్కని భరోసా

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉండగా, బయట మార్కెట్లో దళారులు రూ.1,900కే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చేలోపే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యంగా కేంద్రాలు తెరిస్తే దళారులకే లాభమని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
News March 4, 2026
రాజమండ్రి: అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్మెంట్లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.


