News March 1, 2026
చరిత్ర పుటల్లో గద్వాల రాజకుమారి వివాహ వైభవం

ఆందోల్-పాపన్నపేట సంస్థానాధీశుడితో గద్వాల సంస్థానాధీశుల కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గద్వాల రాజులు తన కుమార్తెకు అపురూపమైన కానుకలను అరణంగా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా పచ్చల హారం ధరించిన తెల్లని పంచకళ్యాణి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గుర్రానికి ఒక కాలికీ వెండి, మరో కాలికీ బంగారు కడియాలు అమర్చారు. కేవలం కానుకలే కాకుండా, భారీ సంఖ్యలో దాసదాసీలు 3 వేల మంది సైనికులు కూడా వెళ్లారు.
Similar News
News April 16, 2026
HYD: జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 16, 2026
ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

కాంగ్రెస్లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్ను సత్కరించారు.
News April 16, 2026
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ‘తేజస్వి’ విజయభేరి

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో HNK తేజస్వి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. శ్రీ వైభవి 486, అవ్ని బిజ్జాల 485, విష్ణుప్రియ 480 మార్కులు సాధించారు. మొత్తం 144 మంది విద్యార్థుల్లో 35 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించడం విశేషం. క్రమశిక్షణతో కూడిన బోధన, నిరంతర పరీక్షలే ఈ విజయానికి కారణమని డైరెక్టర్ రేవూరి భగవాన్ రెడ్డి తెలిపారు.


