News March 2, 2026

వరంగల్: తండ్రి ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య

image

తండ్రి ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ CI రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కలహంది మండలానికి చెందిన భారత్ ఉరుసు శివారు అమ్మవారిపేట ఇటుక బట్టీలలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. తండ్రిని మూడో కుమార్తె(15) ఫోన్ అడగ్గా తర్వాత కొనిస్తానని చెప్పాడు. మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కేసు నమోదైంది.

Similar News

News March 2, 2026

పాకిస్థాన్‌పై విరాట్ అద్భుతం చేశారు: రోహిత్

image

2022 T20WCలో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట’ అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.

News March 2, 2026

NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

image

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.

News March 2, 2026

వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.