News March 2, 2026

గద్వాల జిల్లాలో రెండు నెలల్లో 14 పోక్సో కేసులు!

image

గద్వాల జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేయాలని పోలీసులు సూచించారు.

Similar News

News March 6, 2026

ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

image

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

News March 6, 2026

NGKL: బాలికపై అత్యాచారయత్నం.. UPDATE

image

ఉప్పునుంతల(M) ఓ గ్రామంలో గిరిజన బాలికపై అత్యాచారయత్నం చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల నాటకం చూసి ఇంటికి వెళ్తున్న బాలికను బలవంతంగా ఓ దుకాణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించారు. బాలిక వద్ద ఉన్న సెల్ లైట్‌తో వారి ముఖాలు గుర్తించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 6, 2026

నాగర్‌కర్నూల్: ఫోక్సో కేసులో 20 ఏళ్లు జైలు

image

ఫోక్సో కేసులో ఓ నిందితుడికి నాగర్ కర్నూల్ కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. NGKLలోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ కుమార్(గణేష్) (21)పై 2024లో క్రైమ్ నెంబర్ 294 ఫోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు.