News May 4, 2024
కడప: 2004 తర్వాత ఆ నియోజకవర్గం మాయం

కడప జిల్లాల్లో 1955లో శాసనసభకు ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అప్పట్లో మన జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 2004 వరకు కొనసాగాయి. జిల్లాల పునర్విభజన కారణంగా 2004లో ఒక నియోజకవర్గంగా ఉన్న లక్కిరెడ్డిపల్లెను తప్పించారు. ఇందులో ఉన్న మండలాలను రాజంపేట, రాయచోటిలోకి కలపడంతో ఆ నియోజకవర్గం కనుమరుగైంది. ఈ లక్కిరెడ్డిపల్లె మొదటి ఎమ్మెల్యే కడప కోటిరెడ్డి. చివరి ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి(కాంగ్రెస్).
Similar News
News January 12, 2026
‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
News January 12, 2026
కడప జాయింట్ కలెక్టర్గా నిధి మీనా

కడప జాయింట్ కలెక్టర్గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.


