News March 2, 2026

హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ హతం!

image

ఇరాన్, దాని మద్దతు గ్రూపులకు ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఖమేనీని హతమార్చిన ఆ దేశం తాజాగా హెజ్బొల్లాను టార్గెట్ చేసింది. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి అడుగుపెట్టిన మిలిటెంట్ గ్రూప్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. లెబనాన్‌లోని స్థావరాలపై చేసిన దాడిలో హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ మహమ్మద్ రాద్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. భారీ మూల్యం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

Similar News

News March 4, 2026

అంగన్‌వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

image

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్‌వాడీల అరెస్ట్‌పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.

News March 4, 2026

నెతన్యాహు సైనికుడిగా ఉన్నప్పుడు..

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో ఆ దేశ సైన్యంలో పని చేశారు. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)లో సేవలు అందించారు. IDFలో టాప్ సీక్రెట్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే ‘Sayeret Matkal’ అనే యూనిట్‌లో పని చేశారు. 1972లో సబేనా ప్లేన్ బందీల రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 1973లో కెప్టెన్ ర్యాంక్ సాధించారు. 1996లో ఇజ్రాయెల్ ప్రధానిగా గెలిచి, పిన్నవయసు PMగా ఘనత సాధించారు.

News March 4, 2026

పుట్టిన నగరంలోనే ఖమేనీ ఖననం?

image

ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్‌‌లోని మషాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ పుట్టినిల్లు అయిన ఈ మషాద్ టెహ్రాన్ తర్వాత ఇరాన్‌లోనే అతిపెద్ద నగరం. ఇక్కడి ప్రఖ్యాత ఇమామ్ రెజా ష్రైన్‌లోనే ఖమేనీ తండ్రి సమాధి ఉంది. ఖమేనీకి సైతం ఇక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఇమామ్ రెజా ష్రైన్‌ షియా ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఏటా ఈ ప్రాంతాన్ని 3 కోట్ల మంది సందర్శిస్తారు.