News March 2, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.
Similar News
News March 3, 2026
బాణసంచా పేలి 21 మంది మృతి.. శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
News March 3, 2026
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
News March 2, 2026
వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


