News May 4, 2024

తూప్రాన్: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

image

తూప్రాన్ పట్టణంలో నివాసముండే కిష్టాపూర్‌కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన (27), ముగ్గురు పిల్లలు కార్తీక్(10), ఈశ్వర్(4), అక్షయ(6) అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకోగా.. తూప్రాన్‌లో ఉంటున్నారు. కిష్టాపూర్‌లో తల్లిదండ్రుల వద్ద గల మరో ఇంట్లో ఉండేందుకు నిర్ణయించడంతో గొడవ చేసింది. నిన్న ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది.

Similar News

News March 4, 2026

మెదక్: ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

image

మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్‌లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.

News March 4, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.21% హాజరు

image

మెదక్ జిల్లాలో ఆరో రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-IIA పరీక్షలకు మొత్తం 98.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,017 మందికి గాను 4,932 మంది, ఒకేషనల్ విభాగంలో 541 మందికి గాను 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

News March 4, 2026

మెదక్: కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ ఎస్పీ

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.