News May 4, 2024
వడదెబ్బతో ఆరుగురి మృతి.. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 46 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు, పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.
Similar News
News March 4, 2026
సౌదీపై దాడులు వద్దు.. ఇరాన్కు పాక్ వార్నింగ్!

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని చెప్పింది. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తుచేసింది. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని ఇరాన్ తమకు చెప్పినట్లు పాక్ మంత్రి ఇషాక్ధర్ వెల్లడించారు. కాగా రెండు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా రెండింటిపై జరిగినట్లుగా పరిగణించాలని సౌదీ-పాక్ <<17745790>>డీల్<<>> చేసుకున్న సంగతి తెలిసిందే.
News March 4, 2026
TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.
News March 3, 2026
‘హార్ముజ్’ సంక్షోభం.. ఇండియాకు అండగా రష్యా!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19285220>>మూసివేసిన<<>> నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తాము క్రూడ్ పంపుతామని రష్యన్ వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు ఆయిల్ కొరత ఏర్పడితే రష్యా నుంచి ఇండియా దిగుమతులు పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా క్రూడాయిల్, పెట్రోలియం <<19289613>>నిల్వలు<<>> 40-45 రోజులు వస్తాయని సమాచారం.


