News March 3, 2026

డ్రోన్ల యుద్ధం!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్‌పై, నిన్న అరామ్‌కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్ల‌తో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.

Similar News

News March 6, 2026

ఇక మారవా బ్రో..!

image

నిన్న టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.

News March 6, 2026

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 14దేశాలకు విస్తరించింది. ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమన్, సౌదీ, లెబనాన్, సైప్రస్ వీటిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌కు అండగా నిలుస్తున్న రష్యా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది.

News March 6, 2026

23న నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ చేయనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. రూ.1.5లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, తొలి విడతలో రూ.80వేల కోట్లతో పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.