News March 3, 2026
కడప జిల్లా పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్.!

కడప: జిల్లాలో పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీటి పదవీకాలం ఈనెల 17 నాటికి ముగియనుంది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. జిల్లాలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రెండు వారాల్లో ముగియనుంది. గత ఎన్నికల్లో వీటి అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది.
Similar News
News March 5, 2026
పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: కడప కలెక్టర్

కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చారిత్రక, పర్యటక, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పర్యాటక రంగం ప్రధాన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో JC, టూరిజం అధికారులు పాల్గొన్నారు.
News March 4, 2026
కడప: ప్రత్యేక విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.
News March 4, 2026
కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు.?

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్ఛార్జ్లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.


