News May 4, 2024

మెరకముడిదాం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు 

image

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం మండలం గర్భాంకి చెందిన తాడ్డె చినఅచ్చిన్నాయుడు తొలిసారి గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాంకి చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల సన్యాసప్పలనాయుడు, 1967లో గర్భాంకు చెందిన తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం సాధించారు. 

Similar News

News April 22, 2025

VZM: మంత్రి నిమ్మల జిల్లా పర్యటన షెడ్యూల్ ఇలా

image

జ‌ల‌వ‌న‌రుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉద‌యం 4.30 గంట‌ల‌కు మంత్రి జిల్లాకు చేరుకుంటారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు గుర్ల మండ‌లంలో తార‌క‌రామ తీర్ధ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ బ్యారేజ్‌ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డి నుంచి 9.30కు బ‌య‌లుదేరి, కుమిలి వ‌ద్ద నిర్మాణంలో ఉన్న రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అనంతరం క‌ల‌క్ట‌రేట్‌కు చేరుకొని సమీక్షిస్తారు.

News April 21, 2025

డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం: కిమిడి

image

కూటమి ప్రభుత్వం DSC ప్రకటన విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతుందని TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలోని తన నివాసంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,346 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు.

News April 21, 2025

VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

image

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్క‌ర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.

error: Content is protected !!