News March 4, 2026

ఆనం కుమారుల సైలెంట్‌కు కారణం ఏంటి?

image

నెల్లూరు రాజకీయం అంటే ముందుగా గుర్తు వచ్చేది అనం కుటుంబం. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండు దశాబ్దాల పాటు నెల్లూరులో తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డారు. అయితే ఆయన మరణాంతరం కుమారులు ఆనం రంగ మయూర్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డిలు సైలెంట్‌గా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారని ఆనం కుటుంబం అభిమానులు చెబుతున్నారు. వీరి రాజకీయ ఎంట్రీ ఏ పార్టీల నుంచి అనే దానిపై చర్చ సాగుతోంది.

Similar News

News April 20, 2026

బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

image

నెల్లూరు కలెక్టరేట్‌లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.

News April 20, 2026

ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.

News April 20, 2026

BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

image

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్‌లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.