News March 4, 2026
YELLOW ALERT: 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. అటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో HYD వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 33 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మీ ఏరియాల్లో టెంపరేచర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News March 24, 2026
ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: CM రేవంత్

TG: దేశ రాజకీయాల్లో తాను పని చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని టీవీ9 సమ్మిట్లో స్పష్టం చేశారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని, తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే ప్రజలు తనను హీరో చేశారని పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తల స్నేహితుడినని చెప్పారు.
News March 24, 2026
యుద్ధం.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశం

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇంధన భద్రత, పెరుగుతున్న విద్యుత్ ధరల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్లో 98% పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటం గమనార్హం.
News March 24, 2026
హార్ముజ్ను తెరిచి ఉంచడం అత్యవసరం: మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు <<19466723>>కాల్<<>> వచ్చినట్లు PM మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరిచి, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.


