News March 4, 2026

మేడ్చల్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి!

image

TG ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి సంబంధించిన సీట్లను 210 నుంచి 500 వరకు పెంచింది. కావున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా SC కులాలకు చెందిన అర్హులైన విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఈనెల 31 వరకు ఇ- పాస్ వెబ్‌సైట్ https://www.tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.

News April 17, 2026

తిరుచానూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు

image

తిరుచానూరులో కొత్త సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పనిభారం, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రేణిగుంట, తిరుపతి రూరల్ కార్యాలయాల పరిధిని విభజించి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేణిగుంట నుంచి 3, తిరుపతి రూరల్ నుంచి 19 గ్రామాలను కొత్త కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తారు. దీంతో సేవలవేగం, పారదర్శకత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News April 17, 2026

పల్నాడు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 12,67,982 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 6,23,010 మంది ఉండగా, మహిళలు 6,44,897 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 75 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.