News May 4, 2024
విజయవాడ: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 31, 2025
కృష్ణా జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ కేకులకు భారీ గిరాకీ

జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు ముందే పట్టణాలు, గ్రామాల్లో న్యూ ఇయర్ కేకులకు మంచి గిరాకీ ఏర్పడింది. బేకరీలు, స్వీట్ షాపులు, పళ్ల దుకాణాలు, పూల దుకాణాల వ్యాపారులు ఉదయం నుంచే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసుకుని విక్రయాలకు సిద్ధమయ్యారు. వివిధ రకాల డిజైన్లతో, విభిన్న రుచుల్లో న్యూ ఇయర్ కేకులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో గృహావసరాల కోసం పండ్లు, పూల కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి.
News December 31, 2025
జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు: SP విద్యాసాగర్

కృష్ణా జిల్లా ప్రజలకు SP విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. వేడుకల పేరుతో జనజీవనానికి ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
News December 31, 2025
ఇన్నోవికాస్-2025లో భాగస్వామ్య ఒప్పందం

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో వికాస్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని హబ్ CEO జి. కృష్ణన్ వెల్లడించారు. వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నాలజీ ప్రదర్శన ‘ఇన్నోవికాస్-2025’ రెండో రోజు కొనసాగింది. సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆలోచనలు, నమూనాలను హబ్ ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.


