News May 4, 2024

విజయవాడ: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న  విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News July 9, 2025

మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.

News July 9, 2025

కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

image

విద్యార్థుల అభ్యాసాన్ని, అభివృద్ధిని సమీక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,798 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ఈ సమావేశంలో 2,65,574 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు పాఠశాలల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.