News May 4, 2024
రూ.40 కోట్లు కాజేసిన జీఎస్టీ అధికారులు అరెస్ట్

TG: జీఎస్టీ మాటున రూ.40 కోట్లు కాజేసిన వ్యాపారులు, జీఎస్టీ అధికారులను HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు అధికారులు ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ఉన్నట్లు సృష్టించి జీఎస్టీ రీఫండ్ చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణ కుమారి, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు వేణుగోపాల్, విశ్వకిరణ్, మహిత, డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణ ఉన్నారు.
Similar News
News March 13, 2026
షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

హండ్రెడ్ లీగ్ సన్రైజర్స్లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.
News March 13, 2026
జైశంకర్ స్కెచ్.. అగ్రరాజ్యానికి బ్రిక్స్ చెక్?

విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో మరోసారి ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు BRICS విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. US/ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జైశంకర్ వరుసగా ఇరాన్తో చర్చలు జరపడం హాట్టాపిక్గా మారింది. అయితే ఏకపక్ష నిర్ణయాలతో, ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్న USకు చెక్ పెట్టడమే లక్ష్యంగా BRICSను బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
News March 13, 2026
మాజీ DGP HJ దొర కన్నుమూత

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.


