News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.

Similar News

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.

News March 9, 2026

చిత్తూరు: మామిడి రైతుల కష్టాలు తీరేనా.?

image

మామిడి రైతులు గతేడాది భారీ నష్టాలను చవిచూశారు. అయితే పల్ప్ యూనిట్లు మాత్రం ఉత్పత్తి అయిన 5 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్‌లో దాదాపు 75% విక్రయించాయి. ఇందులో 45%కిపైగా పల్ప్ కంపెనీలకు ట్రాన్స్‌ఫోర్ట్ కాగా మరో 25-30% సీజన్ మొదలయ్యేలోపు రవాణా కానుంది. ఈసారి మామిడికి మంచి రేట్లు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ల సిండికేట్లకు చెక్ పెడితే రైతులకు గిట్టుబాటు ధర తథ్యమంటున్నారు.

News March 9, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 9760 మంది హాజరు

image

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో జరిగిన ఇంటర్ 2nd ఇయర్ గణితం పేపర్-2B పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి పరీక్షలకు 10,136 మంది విద్యార్థులకు గాను.. 9,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. 396 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 9381 మందికి గాను.. 9120 మంది పరీక్షలు రాశారు. 261 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 755 మందికి గాను.. 620 మంది హాజరయ్యారు.