News March 5, 2026
హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

మిడిల్ ఈస్ట్లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.
Similar News
News April 17, 2026
అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
News April 17, 2026
కాసేపట్లో ఓటింగ్.. బలాబలాలు ఇవే

మహిళా రిజర్వేషన్లు(రాజ్యాంగ సవరణ), డీలిమిటేషన్ బిల్లులపై కాసేపట్లో లోక్సభలో ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం LSలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది MPల మద్దతు కావాలి. NDAకి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లులు పాస్ కావాలంటే మరో 67 మంది MPల సపోర్ట్ అవసరం. అటు విపక్షాల బలం 233. ఎక్కువ మంది విపక్ష పార్టీల సభ్యులు గైర్హాజరైతే బిల్లులు పాసయ్యే ఛాన్స్ ఉంది.
News April 17, 2026
16ఏళ్ల నుంచే రిలేషన్షిప్లో ఉన్నా: నటి

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్షిప్స్లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్లో జిమ్కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్పై కామెంట్స్ చేశారు.


