News May 4, 2024

అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ

image

గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్‌కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.

Similar News

News February 12, 2026

3rd క్లాసు నుంచే ఏఐ: ధర్మేంద్ర ప్రధాన్

image

AI రంగంలో భారత్ శరవేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మూడో తరగతి నుంచి అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ చేసే విద్యార్థుల వరకు AIని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన AI కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో మేథో సామర్థ్యానికి లోటు లేదు. AIపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మెషీన్ ఇంటెలిజెన్స్‌, భావోద్వేగాల కలయికతో AIని సృష్టిస్తే అద్భుతాలు చేయొచ్చు’ అని తెలిపారు.

News February 12, 2026

భారత్ వర్సెస్ పాకిస్థాన్, బంగ్లాదేశ్

image

T20 WCలో ఈ నెల 15న భారత్-పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది భారత్ వర్సెస్ పాకిస్థాన్ & బంగ్లాదేశ్‌గా చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇండియాతో వైరం వల్ల WC నుంచి బంగ్లా తప్పుకుంది. దానిపై మొసలి కన్నీరు కారుస్తూ PAK దగ్గరైంది. ఆ 2 దేశాలు ఏకమై మనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ పాక్, బంగ్లాను మన కుర్రాళ్లు చావుదెబ్బ కొడతారని IND ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

News February 12, 2026

విచారణకు రావాలని కాకాణికి నోటీసులు

image

AP: YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీచేశారు. నెల్లూరు జిల్లా కోవూరులోని గుమ్మలళ్లదిబ్బలో గంజాయి బ్యాచు చేతిలో అఘాయిత్యానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈనెల 14న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు వైసీపీ Xలో పేర్కొంది. ప్రశ్నించడమే నేరమన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించింది.