News May 4, 2024
6న మాచర్లకు సీఎం జగన్

సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News March 11, 2026
పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

పెదకాకాని రైల్వే స్టేషన్లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 11, 2026
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

గుంటూరు జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గత నెలలో ఉమ్మడి జిల్లాలో 17.5 మిలియన్ యూనిట్లు వినియోగించగా ప్రస్తుతం 20.1 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గుంటూరు సర్కిల్ పరిధిలో గత నెలలో 7.3 మిలియన్ యూనిట్లు ఉండగా ఇప్పుడు 8.5 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరింది. వేసవి వేడి కారణంగా ఎసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడం దీనికి కారణమని అధికారులు తెలిపారు. విద్యుత్ను పొదుపుగా వాడాలన్నారు.
News March 11, 2026
కలెక్టర్ల సదస్సులో గుంటూరు ప్రతిపాదనలు

అమరావతి సచివాలయంలో బుధ, గురువారాల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈసారి గుంటూరు జిల్లా నుంచి ప్రత్యేక ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థుల కోసం కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్ బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు భోజనం కూడా అందించాలనే ప్రణాళిక ఉంది.


