News March 6, 2026
జిల్లాస్థాయి పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్ ప్రారంభం

పోలీస్ శాఖలో క్రీడల నిర్వహణ ఉద్యోగులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను ప్రారంభించారు. సుమారు 194 మంది సిబ్బంది పాల్గొన్న ఈ పోటీల్లో ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు.
Similar News
News April 5, 2026
నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
News April 5, 2026
శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
News April 5, 2026
రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>


