News March 6, 2026
భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం టికెట్ కౌంటర్లు ఎక్కడంటే.!

ఈనెల 27, 28 తేదీలలో భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు సెక్టార్ల వారీగా టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించినట్లు ఆలయ ఈవో ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్లైన్ టికెట్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు: 1.ఆలయము వద్ద మెయిన్ టిక్కెట్ కౌంటర్, 2.తానీషా కళ్యాణ మండపం CRO, 3.బ్రిడ్జి పాయింట్ CRO, 4. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.
Similar News
News April 18, 2026
సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్ఫెక్ట్గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?
News April 18, 2026
విశాఖ-మహబూబ్నగర్ రైళ్ల పాక్షిక రద్దు

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.


