News May 4, 2024

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా

image

TG: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 6, 7 తేదీల్లో రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఆమె పర్యటన వాయిదా పడింది. ఈనెల 10న ఎల్లారెడ్డి, తాండూర్, షాద్ నగర్‌లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే రాహుల్ గాంధీ పర్యటనలోనూ మార్పులు జరిగాయి. ఆయన ఈనెల 5న నిర్మల్, అలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Similar News

News September 13, 2025

ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

image

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.

News September 13, 2025

ఈమె తల్లి కాదు.. రాక్షసి

image

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.

News September 13, 2025

తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.