News May 4, 2024
జొన్నల కొనుగోళ్ల పరిమితి 12 క్వింటాళ్లకు పెంపు

TG: ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితితో ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలుకు ₹3180 మద్దతు ధరగా చెల్లిస్తోంది. రైతులెవరూ పంటను తక్కువ ధరకు అమ్మవద్దని, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.
Similar News
News July 7, 2025
BIG ALERT.. అతి భారీ వర్షాలు

TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.
News July 7, 2025
డార్క్ చాక్లెట్ తినడం వల్ల లాభాలు!

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది
News July 7, 2025
ఆకాశ్ దీప్.. ఆకాశమంత టాలెంట్ అంతే మనస్సు

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బాలో గతంలో ఆకాశ్ గురించి స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్తో అందరికీ అర్థమైంది.