News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.
Similar News
News April 20, 2026
బల్లికురవ: రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్

ప్రకాశం జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలం రామాంజనేయపురం సమీపంలో ఈ ప్రమాదం జరగ్గా.. అద్దంకి నుంచి సంతమాగులూరు వైపు వెళ్తున్న తమిళనాడు లారీ డ్రైవర్ వాటర్ ట్యాంక్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో లారీ డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోయాయి. హైవే సిబ్బంది అతి కష్టంమీద డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. అంబులెన్స్లో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
News April 20, 2026
ప్రకాశం: ఇళ్ల నిర్మాణాలపై యుద్ధం ఎఫెక్ట్

ప్రకాశం జిల్లాలో కొత్త ఇళ్ల నిర్మాణంపై యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. వార్ ప్రారంభమయ్యాక ఒక్కసారిగా ధరలు పెరిగాయి. యుద్ధం ముందు టన్ను స్టీల్ రూ.55 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.75 వేలకుచేరింది. రూ.260 ఉండే సిమెంట్ రూ.300కు చేరడంతో ఇళ్లు కట్టుకునే వాళ్లకు భారంగా మారింది. సిమెంట్ బ్రాండ్లను బట్టి ఒక్కో బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది.
News April 20, 2026
భైరవకోనకు వెళ్తున్నారా..?

మార్కాపురం జిల్లా CSపురం మండల పరిధిలోని భైరవకోనకు చాలామంది భక్తులు వస్తుంటారు. ఈక్రమంలో ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పామూరు నుంచి CSపురం మీదుగా భైరవకోనకు ప్రతి ఆదివారం బస్సు నడుపుతామని కందుకూరు డిపో అధికారులు ప్రకటించారు. పామూరులో ప్రతి ఆదివారం ఉదయం 8.30గంటలకు, 11.30గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది. ఇదే బస్సుల్లో తిరిగి పామూరు చేరుకోవచ్చు.
Share It.


