News May 4, 2024
HYD: పార్లమెంట్ ఎన్నికలు.. పోలీసుల కవాతు..!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం, ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో ఇదొక భాగమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పకడ్బందీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News September 24, 2024
విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP
రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.
News September 24, 2024
HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే
కేంద్రమంత్రి నితీన్గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.
News September 24, 2024
HYD: పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు!
BRS పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణతో కూడిన ఆపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్క్వాలిఫై చేయాలని ఆయన కోరారు.