News May 4, 2024
మినీ ఇండియా.. మల్కాజిగిరిలో గెలుపెవరిది?

దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓ మినీ ఇండియా లాంటిది. దాదాపు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంలో BRS, కాంగ్రెస్, BJP మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కార్నర్ మీటింగ్స్, గడపగడపకు ప్రచారం, రోడ్డు షోలతో ముందుకు వెళ్తున్నారు. BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండగా ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News March 13, 2026
HYD: శ్రీలంక టూర్కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు అనుమతి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు శ్రీలంక పర్యటనకు అనుమతి లభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఎంపికైన యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడానికి ఈ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. టీమ్తె కోచ్ GS రాజు, మేనేజర్ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ శ్రీనివాస్ ఉంటారు. గ్రాస్రూట్ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందేలా చేయడం లక్ష్యం అంటున్నారు.
News March 13, 2026
HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
News March 13, 2026
HYD: టిఫిన్పై ₹20, చాయ్పై ₹5 ఎక్స్ట్రా

గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద ₹20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. ₹40 ఉండే టిఫిన్పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద ₹5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు మూసేశారు. మీ ఏరియాలోనూ ధరలు పెంచారా?


