News May 4, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

✏పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:CM రేవంత్ రెడ్డి
✏చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా:DK అరుణ
✏నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్ శ్రీ హర్ష
✏NGKL:ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి!
✏పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✏BJP మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది:కాంగ్రెస్
✏GDWL:బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
✏SSC విద్యార్థులపై ఫోకస్
Similar News
News March 16, 2026
MBNR: పీయూలో KHO-KHO సెలక్షన్స్

సౌత్ జోన్లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ KHO-KHO స్త్రీల విభాగంలో ఎంపికలను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు హాజరై మాట్లాడారు. మంచి ప్రదర్శన కనబరిచి యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీడీ డా.వై.శ్రీనివాసులు, ఖో-ఖో ప్రొఫెసర్ సత్య భాస్కర్ రెడ్డి, కోచ్లు తదితరులు పాల్గొన్నారు.
News March 15, 2026
బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయాలి: మాజీ మంత్రి

హైదరాబాద్ లక్డికపూల్లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
News March 15, 2026
MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


